బిగ్ బాస్ 3 కి రంగం సిద్ధం అయ్యింది. ఈ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ లో ఎవరు ఉండబోతున్నారని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే, హౌజ్‌లోకి అడుగుపెట్టనున్న కంటెస్టెంట్లు వీరేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.


1.నటుడు వరుణ్ సందేశ్ 2. నటి హేమ 3. నటి హిమజ 4. నటుడు తరుణ్ 5. యాంకర్ ఉదయభాను 6. గాయకుడు హేమచంద్ర 7. ‘తీన్‌మార్’ సావిత్రి (యాంకర్ శివ జ్యోతి) 8. శ్రీరెడ్డి 9. వైవా హర్ష 10. యాంకర్ శ్రీముఖి 11. యాంకర్ లాస్య 12. మహాతల్లి ఫేమ్ జాహ్నవి 13. రఘు మాస్టర్ 14. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ 15. జర్నలిస్ట్ ‘ముఖాముఖి’ జాఫర్.  ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న జాబితా మాత్రమే.


ఈ జాబితాలో ఒక్క పేరును కూడా ఇంకా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు ఖరారు చేయలేదు. కానీ.. యాంకర్ శ్రీముఖి, ‘తీన్‌మార్’ సావిత్రి, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఖరారయ్యారని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది కచ్చితంగా చెపుతున్నారు. అయితే, ‘బిగ్ బాస్’లో చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ఇప్పటికే యాంకర్ లాస్య, ఉదయభాను, తరుణ్ ఖండించారు. తాము ఈ షోలో చేయడం లేదని చెప్పారు. తాను ‘బిగ్ బాస్’లో చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు అంటూ శ్రీరెడ్డి వరుసపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీళ్లు నలుగురు తప్ప మిగిలిన సెలబ్రిటీలు ఈ వార్తలపై స్పందించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: