‘నిను వీడని నీడను నేనే’ అంటూ ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. ఇప్పటి వరకు హీరోగా సత్తాచాటిన సందీప్ కిషన్ ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న సందీప్‌పై రెజీనాతో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు కూడా రెండేళ్ల క్రితం క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక కాస్త గ్యాప్ త‌ర్వాత సందీప్ చేసిన నిను వీడ‌ని నీడ‌ను నేనే. 


ఆ త‌ర్వాత ఎట్ట‌కేలాకు ఈ సినిమాతో సందీప్‌కు మిక్స్ డ్ రిజల్ట్ తెచ్చిపెట్టింది. అలా అని సినిమాకు మిక్స్ డ్ రిజల్ట్ వచ్చిందని కాదు. ఈ సినిమా కంటెంట్ పరంగా విమర్శలు ఎదుర్కొంటోంది. న‌ట‌నా ప‌రంగా కానీ, కంటెంట్ పరంగా కానీ దీనికి యావరేజ్ మార్కులే వేస్తున్నారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. 


అదే టైమ్‌లో సందీప్ మాత్రం తొలిసారి నిర్మాతగా మారి సందీప్ కిషన్ ఈ సినిమా తీశాడు. సినిమా  యావరేజ్ టాక్‌తో నడుస్తున్నా నిర్మాతగా మాత్రం ఈ హీరో క్లిక్ అయ్యాడు. అలాగే ముందుగా తీసుకున్న ప్ర‌మోష‌న్ల ప‌రంగా ఈ సినిమా రూ. 4 కోట్ల రేషియోలో అమ్ముడు అయింది. మ‌రో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంద‌ని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాతో రిలీజ్ అయిన దొర‌సాని, రాజ్‌దూత్ ఫ్లాప్ అవ్వ‌డంతో ఈ సినిమాకు కాస్త ప్ల‌స్ అయింది. ఏదేమైన మ‌రో సారి నిర్మాతగా సందీప్ కిషన్ హిట్ అయినా హీరోగా మరోసారి ఫెయిల్ అయ్యాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: