యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత నటిస్తోన్న సాహో సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఇంకా ఈ సినిమా రిలీజ్కు కేవలం నెల రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలు సాహోకు ఎదురు వెళ్లే సాహసం చేయలేక సెప్టెంబర్కి వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే మంచి క్రేజ్ సంతరించుకున్న అడివి శేష్ చిత్రం 'ఎవరు' ముందుగా ఆగస్ట్ రిలీజ్కి షెడ్యూల్ అయింది.
అడవి శేష్పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను బయ్యర్లు మంచి రేటుకే కొన్నారు. శేషు ఎంచుకునే కాన్సెఫ్ట్లు చాలా కొత్తగా ఉంటాయన్న నమ్మకం అందరికి ఉంది. అయితే బయ్యర్లు మాత్రం సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయవద్దని... సాహోకు ఎదురెళ్లే సాహసం వద్దని... సెప్టెంబర్కు వాయిదా వేయమని రిక్వెస్ట్ చేశారట.
ఆగస్టులో మన్మథుడు 2, గ్యాంగ్లీడర్ లాంటి చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కనుక ఆ క్రౌడ్ని అవాయిడ్ చేసి సెప్టెంబర్లో మంచి టైమ్ చూసుకుని రమ్మని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేయడంతో ప్రమోషన్లకు ఏకంగా నెల రోజుల టైం దొరికినట్లయ్యింది. గూఢచారి చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసిన శేష్ ఈ చిత్రం విషయంలో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నట్టు తెలిసింది.