రేణు దేశాయ్ ఫిలిం రీ ఎంట్రీ ఖరార్ అయింది. ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తున్న నేపధ్యంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లో ఆమె కీలక పాత్ర చేయడానికి అంగీకరించింది. స్టూవర్ట్ పురం ప్రాంతానికి చెందిన ఒక గజ దొంగ జీవితం ఆధారంగా ఈమూవీ నిర్మాణం జరుపుకో బోతోంది. 

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈమూవీ వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో రానున్న నేపధ్యంలో ఈమూవీలో రేణు దేశాయ్ ఒక కీలక పాత్ర చేస్తోంది అంటూ రచయిత సాయి మాధవ్ బుర్రా ఓపెన్ గా చెప్పడంతో ఇప్పుడు ఈవిషయం ఖరార్ అయింది. అయితే ఇప్పుడు ఈవిషయమై పవన్ అభిమానులు మాత్రం తీవ్ర కలతకు లోను అవుతున్నారు. 

పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై రాజకీయాల బాట పట్టి అక్కడ రాణించలేకపోయిన నేపధ్యంలో తిరిగి సినిమాలలోకి రమ్మని పవన్ అభిమానులు అనేకమంది దర్శక నిర్మాతలు ఒత్తిడి చేస్తున్నా ఆ విషయాలను పవన్ పట్టించుకోవడం లేదు. అయితే పవన్ తో మాత్రమే ఇప్పటి వరకు సినిమాలలో నటించి ఆ తరువాత పవన్ ను పెళ్లి చేసుకుని ఆ పై విడిపోయిన రేణు దేశాయ్ మళ్ళీ యూటర్న్ తీసుకుని తిరిగి సినిమాలలోకి వచ్చే విషయంలో చూపించిన ధైర్యం పవర్ స్టార్ గా లక్షలాది అభిమానులు కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేక పోతున్నాడు అంటూ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు.

దీనికితోడు రేణు దేశాయ్ దర్శకురాలుగా నిర్మాతగా చేసిన ప్రతి ప్రయోగం వెనుక పవన్ ప్రోత్సాహం ఉందని ఆమె అనేకసార్లు ఓపెన్ గానే చెప్పింది. ఈ నేపధ్యంలో పరిస్థితులను ఎదురీదుతూ తిరిగి రాణించాలని రేణు దేశాయ్ చేస్తున్న ప్రయత్నాలలోని స్ఫూర్తి పవన్ ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు అంటూ పవన్ వీరాభిమానులు కనీసం రేణు దేశాయ్ ని చూసి అయినా పవన్ మనసు మారాలి అని కోరుకుంటున్నారు..   
 


మరింత సమాచారం తెలుసుకోండి: