రష్మిక మందన్న ఈ పేరు టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యింది.  ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ తెలుగులో అనతికాలంలోనే టాప్ మూవీస్ లో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది.  ఛలో హిట్ తరువాత అనుకోకుండా గీత గోవిందంనుంచి అవకాశం వచ్చింది.  


ఈ మూవీ కోసం గీతా ఆర్ట్స్ చాలామందిని ట్రై చేసింది.  చివరకు రష్మికకు ఛాన్స్ దక్కింది.  అంతేకదా తినే గింజపై దేవుడు ఎవరి పేరు రాసిపెట్టి ఉంటె వాళ్ళకే దక్కుతుంది.  ఇదీ అంతే.  అవకాశం దక్కించుకున్న రష్మిక తన పెరఫామెన్స్ తో అదరగొట్టింది.  


ము ము ముద్దంటే చేదా అన్నట్టుగా ముద్దిచ్చేసింది.  ఇంకేముంది సినిమాకు పొలోమంటూ డబ్బులు వచ్చాయి.  ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది.  ఛలో సినిమాకు 40 లక్షలు పారితోషికం తీసుకుంటే.. గీత గోవిందం దగ్గరకు వచ్చేసరికి 60 కి పెంచింది.  


గీత గోవిందం తరువాత దేవదాస్ చేసింది.  అది మంచి విజయం సాధించింది.  విజయ్ దేవరకొండతో చేసిన డియర్ కామ్రేడ్ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది.  మరోవైపు మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ చేస్తున్నది. ఈ మూవీ ప్రస్తుతం కాశ్మీర్ లో షూట్ జరుగుతున్నది.  దీంతో పాటు రష్మిక నితిన్ తో భీష్మ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: