ఈవారం విడుదల కాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి ఊహించిన స్థాయికన్నా మంచి బిజినెస్ జరగడంతో ఈమూవీ పై రామ్ పూరి జగన్నాథ్ లు చాల ఆశలు పెట్టుకున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలు ఈరోజు జరగబోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈసినిమాకు సెన్సార్ తల పోట్లు తప్పవు అనీ ఈమూవీలోని డైలాగ్స్ సెన్సార్ కత్తెర పడటమే కాకుండా ఈమూవీకి ‘ఎ’ సర్టిఫికేట్ రావడం ఖాయం అంటూ ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలు జరగకుండానే ప్రచారం మొదలైపోయింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో డబల్ మీనింగ్ డైలాగ్స్ లెక్కలేనన్ని స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. 

దీనితోపాటు ఈమూవీలో ఒకటి రెండు హాట్ సీన్స్ కూడ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే స్థాయిలో ఉండబోతున్నట్లు సమాచారం. దీనితో ఈ సీన్స్ అదేవిధంగా ఈ డైలాగులకు సెన్సార్ వర్గాల అసహనానికి లోనవ్వడం ఖాయం అంటూ గాసిప్పులు గుప్పు మంటున్నాయి. అయితే ఈమధ్య కాలంలో సెన్సార్ తన ధోరణిని మార్చుకుని బూతు డైలాగుల పట్ల చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది. 

‘ఫలక్ నామా దాస్’ మూవీలో కొన్ని బూతు డైలాగులు ఉన్నా వాటిని పట్టించుకోకుండా వదిలి వేసారు. దీనితో పూరి తన మాటల చాతుర్యంతో సెన్సార్ వర్గాలను మెప్పించి తన మూవీలోని బూతు డైలాగులకు కత్తెర పడకుండా లైన్ క్లియర్ చేసుకుంటాడా లేదా అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి పెరిగిపోతోంది. ఇది చాలదు అన్నట్లుగా ‘ఇస్మార్ట్ శంకర్’ కు జరిగిన భారీ బిజినెస్ విషయంలో వచ్చిన వార్తలు అన్నీ అవాస్తవాలు అనీ కేవలం పూరీ ఛార్మీలు తమ ఇమేజ్ పెంచుకోవడానికి ఇలాంటి లీకులు ఇచ్చారని ఒక బూతుల సినిమాకు ఇంత బిజినెస్ ఎక్కడ జరుగుతుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: