బిగ్‌బాస్‌-3 రియాలిటీ షోపై  మరో కేసు నమోదయింది. ఇప్పటికే తనను బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకున్నా అగ్రిమెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి లైంగిక వేధింపులకు పాల్పపడ్డారని యాంకర్ శ్వేతారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నటి గాయత్రి గుప్తా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్ షోకి తాను సెలక్టయ్యానని చెప్పి ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని, దీంతో ఆరు సినిమాల్లో నటించే అవకాశాన్ని వదులుకున్నానని తెలిపింది. 

రఘు, రవికాంత్ అనే ఇద్దరు కార్యక్రమ నిర్వహకులు ఇటీవల తనను కలిసి  బిగ్‌బాస్‌ షోలో పాల్గొనాలని అడిగారని ఆమె తెలిపారు. అనంతరం వారు షో గురించి మాట్లాడుతూ.. తనతో అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తి చేస్తారని అసభ్యకరరీతిలో ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తిరిగి కొన్ని రోజుల తర్వాత షోలో అవకాశం లేదన్నారని తెలిపారు.

షోకు ఎంపిక చేశారన్న ఉద్దేశంతో చేతిలో ఉన్న ఆరు సినిమాలను వదిలేసుకున్నానని వాపోయింది. ఆ నష్టపరిహారం ఇవ్వాల్సింగా షో నిర్వాహకులను అడిగానని, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించానని గాయత్రి తెలిపింది. ఈ మేరకు బిగ్ బాస్ షో నిర్వాహకులపై ఆమె కేసు వేశారు. తనకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు గాయత్రీ గుప్తా.


మరింత సమాచారం తెలుసుకోండి: