మరో 6 రోజుల్లో స్టార్ మా ఛానెల్లో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతుంది. 16 మంది సెలబ్రిటీలు 100 రోజుల పాటు ఈ షోలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల్లో టీవీ9 ఛానెల్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే జాఫర్ పాల్గొనబొతున్నట్లు సమాచారం. తన ఇంటర్వ్యూలలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే జాఫర్ బిగ్ బాస్ షోలో ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తాడో చూడాలి.

 

వీ6 ఛానెల్లో తీన్మార్ వార్తలతో మంచి పేరు తెచ్చుకున్న తీన్మార్ సావిత్రి కూడా ఈ షోలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ షో కోసం తన ఉద్యోగానికే రాజీనామా చేసిందట. మల్లీశ్వరి,అతడు, జులాయి సినిమాల్లో నటించిన హేమ కూడా ఈ షోలో పాల్గొంటుందట. పటాస్ షోకు యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖి కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంటుందట. ఈ షోలొ పాల్గొనటం కోసం ఈమెకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసారని తెలుస్తుంది.

 

సీరియల్స్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించే జాకీ కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నాడట. యువ హీరో వరుణ్ సందేశ్ అతని భార్య ఇద్దరూ ఈ షోలో ఉండబోతున్నారట. గత రెండు సీజన్లలో లేని విధంగా ఈసారి భార్యా భర్తలిద్దరికీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. వీళ్ళు కాక సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపించిన అమ్మాయి , శతమానం భవతి ఫేమ్ హిమజ ఈ షోలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: