క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఏవిషయం పై అయినా చాల స్పష్టంగా నిజయితీగా మాట్లాడుతాడు అని అతడి అభిమానులు భావిస్తూ ఉంటారు. అయితే విజయ్ కూడ రాజకీయ నాయకుడులా ఒక విషయం పై మార్చుకున్న డబల్ టంగ్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమధ్య విజయ్ తన లేటెస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కు బెంగుళూరు వెళ్ళాడు.

అక్కడ మీడియాతో మాట్లాడిన విజయ్ అనేక ఆసక్తికర విషయాల పై స్పందించాడు. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధి విజయ్ ను ‘కబీర్ సింగ్’ సినిమా చూసారా అంటూ అడిగిన ప్రశ్నకు వింత సమాధానం ఇచ్చాడు. ఇప్పటికే 250 కోట్లు కలక్ట్ చేసిన ఈమూవీ గురించి తానేమి మాట్లాడననీ ఈమూవీని ఇప్పట్లో చూసే ఉద్దేశ్యం తనకు లేదు అంటూ కూడ కామెంట్ చేసాడు. 

దీనికి కారణం తన ‘అర్జున్ రెడ్డి’ కన్నా ‘కబీర్ సింగ్’ సూపర్ హిట్ అయిన నేపధ్యంలో ఆసినిమా పై తన కామెంట్స్ ఎందుకు అంటూ వితండ వాదన చేసాడు. అయితే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఒక మీడియా సమావేశంలో విజయ్ మాట్లాడుతూ తాను తన సినిమా షూటింగ్ కోసం ఫ్రాన్స్ వెళ్లానని దీనితో సమయం కుదరక తాను ‘కబీర్ సింగ్’ ను చూడలేదనీ అయితే ఇప్పుడు ఖాళీ సమయం దొరికింది కాబట్టి ఇప్పుడు ‘కబీర్ సింగ్’ చూస్తాను అంటూ కామెంట్ చేసాడు.

అయితే ఇప్పుడు బెంగుళూరు వెళ్లి రూట్ మార్చి ఇలా విజయ్ కామెంట్ చేయడంతో విజయ్ డబల్ టంగ్ లోని మీనింగ్ ఏమిటి అంటూ కొందరు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు విజయ్ ను క్రేజీ హీరోగా మార్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ దర్శకుడు సందీప్ వంగాతో విజయ్ మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఆ సాన్నిహిత్యాన్ని కూడ లెక్క చేయకుండా ఇప్పుడు విజయ్ ‘కబీర్ సింగ్’ ను చూడను అంటూ ఓపెన్ గా చెప్పడం వెనుక కారణం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: