మహానటి’ మూవీ సూపర్ సక్సస్ తో దర్శకుడు నాగ్ అశ్వని పేరు మారుమ్రోగి పోవడంతో అతడిని తన ఇంటికి పిలిచి సత్కరించిన చిరంజీవి మంచి కథ తీసుకు వస్తే అతడి మూవీలో నటిస్తాను అంటూ ఓపెన్ గానే చెప్పాడు. ఈ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా నాగ్ అశ్విన్ చిరంజీవితో సినిమా తీసే విషయంలో ఒక్క అడుగు కూడ ముందుకు వెయ్యలేకపోయాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహంతో నాగ్ అశ్విన్ చిరంజీవి బ్లాక్ బస్టర్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మూవీకి సీక్వెల్ చేయాలని నాగ్ అశ్విన్ దాదాపు 8 రకాల కథలను చిరంజీవికి వినిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ 8 రకాల స్టోరీ వెర్షన్స్ విన్న చిరంజీవి ప్రతి కథలోనూ ఎదో ఒక మార్పు చెప్పడంతో నాగ్ అశ్విన్ విసిగి పోయినట్లు టాక్.

దీనితో అసలు చిరంజీవి తాను అన్నమాట ప్రకారం తనతో సినిమా చేస్తాడా లేదా అన్న విషయం పై నాగ్ అశ్విన్ కే క్లారిటీ లేదు అని అంటున్నారు. వాస్తవానికి చిరంజీవి ఈ ఏడాది కొరటాలతో సినిమా చేసిన తరువాత వచ్చే ఏడాది తాను చేయబోయే సినిమాకు సంబంధించి నాగ్ అశ్విన్ ను లైన్ లో పెట్టాడు. 

అయితే ఒక యంగ్ డైరెక్టర్ ను నమ్ముకుని తనకెంతో పేరు తీసుకు వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ప్రాజెక్ట్ లోకి వెళ్ళడం కంటే ఎవరైనా చేయి తిరిగిన ప్రముఖ దర్శకుడుతో వచ్చే సంవత్సరం సినిమా చేస్తే బాగుంటుంది అని చిరంజీవి సన్నిహితులు ఆయనకు సలహాలు ఇచ్చినట్లు టాక్. దీనితో నాగ్ అశ్విన్ పెండింగ్ లో పడ్డాడు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఈ యంగ్ డైరెక్టర్ చిరంజీవికి మరికొన్ని కథలు వినిపిస్తాడా లేకుంటే తాను మరొక హీరోతో సినిమాను చేసుకుంటాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: