జులై 21న ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ షోలో ఇప్పటికే శ్రీముఖి, సావిత్రి, వరుణ్ సందేశ్, హిమజ, హేమ లాంటి సెలబ్రిటీలు పాల్గొంటున్నట్లు తెలిసింది. వీళ్ళతో పాటు సినిమాల్లో బాగానే పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ మహేశ్ విట్టా కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. చిత్తూరు, నెల్లూరు యాసల్లో మాట్లాడుతూ కామెడీ చేసే ఈ కమెడియన్ బిగ్ బాస్ షోలో పాల్గొంటే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ బాగానే దొరుకుతుంది. 
 
మహేశ్ విట్టా యుట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో ఎక్కువగా నటించాడు. కొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారక్టర్లో కనిపించాడు. కృష్ణార్జున యుధ్ధం సినిమా మహేశ్ విట్టాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత ప్రస్తుతం మహేశ్ విట్టా బిగ్ బాస్ షోలో కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ షోలో పాల్గొంటే మహేశ్ విట్టాకు కూడా షో అయిపోయిన తరువాత 
సినిమా ఛాన్సులు పెరిగే అవకాశం ఉంది. 
 
బిగ్ బాస్ సీజన్ 2 లో సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. కానీ సీజన్ 3 లో మాత్రం సామాన్యులకు చోటు లేనట్లు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో నాగార్జున బిగ్ బాస్ ఎలా హోస్ట్ చేస్తాడనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది. బిగ్ బాస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ కాగా సీజన్ 2 సీజన్ 1 స్థాయిలో అలరించలేకపోయింది. బిగ్ బాస్ సీజన్ 3 ఎలా ఉంటుందో తెలియాలంటే మరో వారం దాకా ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: