దాదాపు కొద్ది నెలల నుండి మెగా కాంపౌండ్ నుండి సరైన హీరో సినిమా రాకపోవడంతో మెగా అభిమానులు ముఖ్యంగా చిరంజీవి అభిమానులు సైరా సినిమా అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా తట్టు ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా ఇండస్ట్రీ నుండి సూపర్ సాలిడ్ అప్డేట్ ఇలాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. మేటర్ ఏమిటంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్ర పోరాట యోధుడిగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్రలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ఇటీవలే తాజాగా ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన ఒక వార్త ఏమిటంటే...సైరా సినిమా సంగీత దర్శకుడిగా స్టార్టింగ్ లో మ్యూజిక్ లెజెండ్ ఏ ఆర్ రెహమాన్ ని చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ను ఎంచుకున్నారు.కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచినట్టైతే మాత్రం బాలీవుడ్ కు చెందిన మరో సంచలన సంగీత దర్శకుడిని తీసుకున్నట్టు తెలుస్తుంది.


బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచిన “భజరంగి భాయీజాన్”, “టైగర్ జిందా హై” అలాగే ఇటీవలే తెరకెక్కిన “భారత్” చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన “జూలియస్ పకియం” సైరా కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తన్నట్టు సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో జూలియస్ పకియం తీరే వేరు అని..ఖచ్చితంగా సైరా సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెగా అభిమానులను సినిమా హాల్లో సీట్లో కూర్చోకుండా చూసేలా ఉంటుందని అంటున్నారు సినిమా యూనిట్ కి చెందినవారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: