టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పేయిర్ లలో ఒకరు రష్మిక మందన, విజయ్ దేవరకొండ. వీరిద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇదిలా ఉండగా గతంలో రష్మిక మందన కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో...ప్రేమలో పడి ఉచిత అర్థం చేసుకోవడం జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి అన్న నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని వార్తల్లో నిలిచింది.


అప్పటి నుండి ఇప్పటి వరకు రష్మికకి రక్షిత్ కి సంబంధించిన ఏదో ఒక వార్త మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇటీవల ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా రష్మిక తన టీంతో కలిసి బెంగుళూరుకి వెళ్ళింది. అయితే అక్కడ కూడా ఆమెకి తన పాత ఎఫైర్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో కల్పించుకున్న విజయ్ దేవరకొండ రష్మిక బ్రేకప్ గురించి అడిగిన జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యారు.


''మీరేం అడుగుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగతమైన మీటింగ్ కాదు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్.. ఇందులో ఇతర అనవసరమైన విషయాలు తీసుకురావొద్దు'' అంటూ యాంకర్ పై సీరియస్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అయినా గాని అక్కడ ఉన్న రిపోర్టర్లు వాటి గురించి ప్రశ్నలు అడిగి మరి రష్మిక మంద ను ఇబ్బంది పెట్టారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: