హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన రాజుగారి గది సిరీస్ లోని రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  ఈ రెండు తరువాత మూడో సినిమాకు ప్లాన్ చేశారు.  రాజుగారి గది 3 సినిమాలో మొదట తమన్నా అనుకున్నారు.  ముహూర్తం షాట్ కూడా పూర్తయింది.  


కానీ, తమన్నా యూనిట్ కు షాక్ ఇచ్చింది.  సినిమా నుంచి పక్కకు తప్పుకుంది.  బాలీవుడ్ లో మంచి అఫర్ రావడంతో పక్కకు తప్పుకుంది.  తమన్నా స్థానంలో తాప్సి అనుకున్నారు.  కానీ అది కుదరలేదు.  కాదు కాదు.. చందమామ కాజల్ చేస్తుందని అనుకున్నారు.  


అది కూడా కేవలం పుకార్లే అని ట్లిపోయింది. ఇప్పుడు రష్మీని తీసుకుంటున్నారని అంటున్నారు.  ఇందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాలి.  రాజుగారి గదికి హీరోయిన్లు ఎందుకు దొరకడం లేదు.  కారణం ఏంటి అనే విషయాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి.  


ఇందులో హీరోయిన్ కు అంటే దెయ్యం పాత్ర చేయాలి.  ఒకసారి అలాంటి పాత్రలు వేస్తె.. మళ్ళీ మళ్ళీ అలాంటి పాత్రలే వేయాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారు హీరోయిన్.  ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియడం లేదు.  ఓంకార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అసలు హీరోయిన్ దొరుకుతుందా.. హీరోయిన్ లేకుండానే సినిమాను కానిచ్చేస్తారా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: