ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సాయిపల్లవి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. ఆ తర్వాత సాయిపల్లవి నటించిన ఎంసీఎ సినిమా కూడా సూపర్ హిట్టైంది. వరుస సక్సెస్ లతో జోరు మీదున్న సాయి పల్లవికి కణం, పడి పడి లేచే మనసు సినిమాలతో ఫ్లాపులు పలకరించాయి. తమిళంలో సాయిపల్లవి నటించిన మారి2, ఎన్జీకె సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం తమిళంలో సాయిపల్లవికి అవకాశాలు రావట్లేదు. 
 
తెలుగులో మాత్రం విరాటపర్వం 1992 అనే సినిమాలో సాయిపల్లవి నటిస్తుంది. మరో వారం రోజుల్లో రిలీజవబోతున్న డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. కానీ ముందుగా డియర్ కామ్రేడ్ సినిమాలో హీరోయిన్ గా నటించమని సాయిపల్లవిని సంప్రదించారట మూవీ మేకర్స్. కథ విన్న సాయిపల్లవి నిర్ణయం చెప్పటానికి ఆలస్యం చేయటంతో అదే సమయంలో రష్మిక ఈ సినిమాలో నటించటానికి ఒప్పుకోవటంతో డియర్ కామ్రేడ్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రష్మికకు వచ్చిందట. 
 
కానీ సాయి పల్లవి డియర్ కామ్రేడ్ సినిమాకు ఓకె చెప్పి ఉంటే బాగుండేదని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. జులై 26న విడుదల కాబోతుంది డియర్ కామ్రేడ్ సినిమా. భరత్ కమ్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: