ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు "ఎ" సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇవ్వటంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు "యు/ఎ" సర్టిఫికెట్ ఎక్కువగా వచ్చింది మూవీ మేకర్స్ కొన్ని సీన్లు కట్ చేయించుకుని మరీ యు/ఎ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. 
 
కానీ పూరి మాత్రం ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ వస్తుందని ముందే ఊహించి ఉంటాడు. ఎందుకంటే సినిమాలో డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు ట్రైలర్ విడుదలైనపుడే ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ వస్తుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా చూడటానికి యూత్ మాత్రం భారీగా ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. 
 
ఇస్మార్ట్ శంకర్ జులై 18 వ తేదీన ( గురువారం ) విడుదల కాబోతుంది. సవ్యసాచి ఫేమ్ నిధి అగర్వాల్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరీజగన్నాథ్, రామ్ ఈ సినిమాతో భారీ స్థాయి హిట్ అందుకుంటామని ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే గురువారం దాకా ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: