టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్లుంది ఉంది. గతంలో తాను దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యి రికార్డులు సృష్టించగా..గత కొంత కాలం నుండి తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో పూరి కెరియర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రోజులలో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఘనత పూరి జగన్నాథ్ కి గతంలో ఉండేది.


అయితే చాలా టైమ్ తీసుకుని సినిమాలు చేస్తున్న ప్రేక్షకులను అలరించ లేకపోతున్నాడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమా తెరకెక్కించడం జరిగింది. జులై 18న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే బాలయ్య తో పూరి జగన్నాథ్ సినిమా ఉంటుందని వస్తున్న ఇండస్ట్రీ నుండి అనేక వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య సినిమా పై క్లారిటీ ఇచ్చాడు పూరి.


బాలయ్యతో సినిమా అంటే కొత్తకొత్త స్టోరీలు రాయాలని...అన్ని రకాల సినిమాలు బాలకృష్ణ గారు చేశారని...కాబట్టి బాలయ్య గారి తో సినిమా అంటే చాలా టైమ్ తీసుకోవాలని కొత్త స్టోరీ రాసుకోవాలని. ఏ కథ చేద్దామన్న.. ఆ టైప్ కథలు నాలుగైదు ఆయన ఖాతాలో ఉంటాయని అందుకే ఈసారి బాలయ్య కోసం కొత్తగా ఓ కథ రాద్దామనుకుంటున్నా.. అని చెప్పారు. ఇదే క్రమంలో బాలకృష్ణ కూడా పూరి జగన్నాథ్ ప్రస్తుతం తీస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా హిట్టయితే ఖచ్చితంగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: