ఎన్నో వివాదాలు, మరెన్నో విమర్శలు తెచ్చుకున్న టాలీవుడ్ అర్జున్ రెడ్డి లానే బాలీవుడ్ కబీర్ సింగ్ సినిమా కూడా వసూళ్ల విషయంలో ఏమాత్రం మాత్రం తగ్గడంలేదు. ఓవైపు మహిళా సంఘాలు ఈ సినిమాను దుమ్మేత్తిపోస్తున్న సినిమా చూసే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గలేదు. రీసెంట్‌గా నాలుగో వారాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మరో రికార్డు సృష్టించింది. వరల్డ్ వైడ్ గా 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. కేవలం 70 కోట్ల బడ్జెట్ లో తీసిన ఈ సినిమా ఇప్పుడు 4 వీకెండ్స్ గడిచేసరికి ఏకంగా 300 కోట్ల సంపాదించడంతో ట్రేడ్ ను ఆశ్చర్యపోయింది. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాకు 260 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా నార్త్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.

తెలుగులో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్, కియరా నటించారు. సందీప్ రెడ్డి వంగ డైరక్ట్ చేసిన ఈ సినిమాను బాలీవుడ్ క్రిటిక్స్ ఏకిపడేశారు. ఇదేం సినిమా అంటూ కామెంట్స్ చేశారు. అయితే సందీప్ రెడ్డి కూడా అస్సలు తగ్గలేదు. క్రిటిక్స్ పేర్లు ప్రస్తావించి మరీ ఎదురుదాడికి దిగాడు. త్వరలోనే అర్జున్ రెడ్డికి బాబులాంటి మరో సినిమా తీస్తానని కూడా ఛాలెంజ్ చేశాడు.

ఈ వివాదం సంగతి పక్కనపెడితే టాలీవుడ్ ప్రేక్షకుల తరహాలోనే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అర్జున్ రెడ్డిని బాగా ఆదరించారు. మొదటివారం ఈ సినిమాకు 134 కోట్లు రాగా, రెండోవారం 79 కోట్లు, మూడోవారం 36 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మరో వారంరోజుల పాటు ఈ సినిమా థియేటర్లలో కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఎదేమైనా సందీప్ రెడ్డి అటు టాలీవుడ్ లో ఇటు బాలీవుడ్ లో సంచనల దర్శకుడిగా క్రేజ్ ను తెచ్చుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: