పాలిటిక్స్ లో నారా వారసుడు లోకేష్ ఎలాగు రాణించలేదు అనుకున్నాడో ఏమో లేటెస్ట్ గా తన ఫీల్డ్ మార్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్ ఇచ్చిన షాక్ కు నాకెందుకు వచ్చిన పాలిటిక్స్ అనుకున్నాడో ఏమో కాని సడెన్ గా నారా లోకేష్ ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నట్టు తెలుస్తుంది. లోకేష్ కొత్త అవతారమా ఏంటది ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాడుగా మరింకేంటి అనుకోవచ్చు అదే సినిమా నిర్మాణం.


నందమూరి ఫ్యామిలీ సినిమాల్లో సూపర్ సక్సెస్ అయ్యింది. ఎన్.టి.ఆర్ లెగసీని బాలకృష్ణ, తారక్, కళ్యాణ్ రాం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉంటే నారా ఫ్యామిలీ నుండి కేవలం రోహిత్ ఒక్కడే పోరాడుతున్నాడు. నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సరే నారా రోహిత్ పెద్దగా స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేదు. 


ఇక ఇప్పుడు నారా లోకేష్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడట. కొంపదీసి హీరోగా చేస్తున్నాడా ఏంటి అంటే అంత సాహసం చేయట్లేదు కాని నారా లోకేష్ సినిమా నిర్మాతగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. అదికూడా మామయ్య బాలకృష్ణ సినిమా నిర్మించేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సింగీతం శ్రీనివాస్ తో బాలయ్య కొన్నాళ్లుగా ఆదిత్య 369 సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడు.      


ఆదిత్య 999 టైటిల్ తో వచ్చే ఈ సినిమాకు స్క్రిప్ట్ పూర్తి అయ్యిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు నిర్మాతగా నారా లోకేష్ వ్యవహరిస్తారని తెలుస్తుంది. ఎలాగు ప్రతి పక్షంలో ఉన్నా టిడిపికి నారా లోకేష్ తో పెద్దగా పని ఉండదు. అందుకే నిర్మాతగా సిని ఇమేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు లోకేష్. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: