కుమారి 21ఎఫ్ తో కుర్రళ్ల హృదయాలను గెలుచుకున్న క్రేజీ బ్యూటీ హెబ్భా పటేల్. రాజ్ తరుణ్ తో హెబ్భా పటేల్ రొమాన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అంతేకాదు అమ్మడు స్కిన్ షో సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సుకుమార్ నిర్మాతగా చేసిన మొదటి ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యింది. 


కుమారి సినిమా ఇచ్చిన క్రేజ్ తో వరుస అవకాశాలు అందుకున్న హెబ్భా పటేక్ వాటిని సూపర్ హిట్ గా మలచుకోవడంలో మాత్రం విఫలమైంది. సినిమాల కౌంట్ పెరుగుతున్నా కుమారి రేంజ్ హిట్ పడలేదు. రీసెంట్ గా 24 కిస్సెస్ అంటూ మరో రొమాంటిక్ మూవీతో వచ్చినా పని జరుగలేదు. 


ఇక దాదాపు అమ్మడు కెరియర్ ముగిసింది అనుకునేలోపు హెబ్భా పటేల్ కు లక్కీ ఛాన్స్ వరించింది. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల డైరక్షన్ లో నితిన్ హీరోగా భీష్మ సినిమా వస్తుంది. ఆ సినిమాలో హెబ్భా పటేల్ కు ఛాన్స్ వచ్చింది. ఆల్రెడీ భీష్మ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.


అయితే సెకండ్ హీరోయిన్ గా హెబ్భా పటేల్ నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో సినిమా ఛాన్స్ కూడా వచ్చిందని తెలుస్తుంది. మరి హెబ్భా పటేల్ కు ఇప్పుడైనా లక్ కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి. మంచి ఛాన్స్ వస్తే తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్న అమ్మడికి భీష్మలో అవకాశం వచ్చింది. మరి సినిమాలో అమ్మడు ఎలా రెచ్చిపోతుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: