పూరి జగన్నాథ్ సినిమాలు ఒకప్పుడు సూపర్ హిట్ అయ్యేవి.  టెంపర్ తరువాత ఒక్క సరైన హిట్ లేదు.  అంతకు ముందు కూడా పెద్దగా హిట్స్ లేవు.  కెరీర్లో ఎన్నో హిట్స్ ఇచ్చాడు.  టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు.  అలాంటి పూరికి సినిమాలు లేకపోవడం విడ్డూరంగా మారింది. పూరి బద్రి సినిమాతో మొదలు పెట్టిన ప్రయాణం అప్రతిహాసంగా సాగింది.  


ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీశాడు.  ఇది జులై 18 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.  ఏ సర్టిఫికెట్ వచ్చింది అంటే అది ఫ్యామిలీ ఆడియన్స్ ఎఫెక్ట్ ఉంటుంది.  


అందులో అడల్ట్ కంటెంట్ ఉంటుందని ఫ్యామిలీ ఆడియన్స్ వెనక్కి తగ్గుతుంటారు.  గతంలో పూరి దర్శకత్వం వహించిన దేశముదురు, పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు కూడా ఏ సర్టిఫికెట్ పొందాయి.  ఈ మూడు సినిమాలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. 


ఇదే బాటలో పూరి ఇస్మార్ట్ శంకర్ కూడా హిట్ అవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటేష్ లు నటించారు.  చాలా కాలం తరువాత మణిశర్మతో కలిసి పూరి పనిచేస్తున్నారు.  ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నది.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే జులై 18 వ తేదీ వరకు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: