పైసా వసూల్ మూవీలో బాలయ్యను కొత్త డైమన్షన్లో చూపించిన డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఇపుదు ఇస్త్మార్ట్ శంకర్ హిట్ అవుతుందన్న ధీమాలో ఉన్నారు. ఈ సినిమా కోసం మనసు పెట్టి పనిచేసిన పూరీ ఇది తన కెరీర్లో బెస్ట్ మూవీ అంటున్నారు. ఇప్పటికే 35 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ రాం కెరీర్లో  కూడా అది పెద్ద బిజినెస్ గా చెబుతున్నారు.


ఇదిలా ఉండగా ఇస్మార్ట్ శంకర్ మూవీ తప్పకుండా హిట్ కొట్టి తీరుతుందని పూరీ చెబుతున్నారు. ఇది తెలంగాణా కుర్రాడి కధ అని, ఇక్కడ మాస్ లీడర్ ఎలా ఉంటాడో చూపించే ప్రయత్నమని చెప్పారు. ఈ మూవీలో రామ్ ఎన‌ర్జీని పూర్తిగా వాడేసానని కూడా చెబుతున్నారు. ఇక హీరోయిన్లు  నభా నటేష్, నిధి అగర్వాల్ తెరపై బాగా మెరుస్తారని కూదా పూరీ అంటున్నారు.


ఈ మూవీ తరువాత బాలయ్యతో కొత్త మూవీకి రెడీ అవుతున్నట్లుగా చెప్పారు. తన దగ్గర అద్భుతమైన కధ ఉందని, అది బాలయ్యకు చెప్పి ఆయన్ని రెండవసారి డైరెక్షన్ చేసే చాన్స్ తీసుకుంటానని పూరీ అంటున్నారు. మరి బాలయ్య మెచ్చే సబ్జెక్ట్ పూరీ దగ్గర ఉంటే నందమూరి ఫ్యాన్స్ కి పండుగే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: