ఇస్మార్ట్ శంకర్.. మాంచి మాస్ మసాలా సినిమాగా 18వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తీ చేసుకుంది. అయితే ఈ సినిమాకు 'A' సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బృందం. అంటే ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే..! పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన గత సినిమాల్లో దేశముదురు, పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలకు  'A' సర్టిఫికెట్ వచ్చింది.

ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనీ.. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కూడా అదే రిపీట్ చేయబోతోందని చిత్ర బృందం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో చెప్పుకొచ్చింది. సినిమా ప్రేమికులు జులై 18న తమ నిర్ణయం ఏమని చెబుతారో చూడాలి.   పూరీ జగన్నాథ్.. ఈయన సినిమాలకు.. సినిమాల్లో ఉన్న డైలాగ్ లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు.

అయితే ఇటీవలి కాలంలో ఆయనకు సరైన హిట్స్ లేవు..! మునుపటి పూరీ జగన్నాథ్ స్టైల్ మాస్ సినిమా చూడాలని తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి..  హైదరాబాదీ బిరియానీ లాంటి సినిమా అందించడానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో జతకలిసాడు.


'ఇస్మార్ట్ శంకర్' ను తెరకెక్కించాడు. ఇప్పటికే టీజర్ లకూ,  ట్రైలర్, ఆడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ ను ఇప్పటి వరకూ తెరపై చూడని రీతిలో పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో చూపించాడు. రామ్ కూడా పూరీ హీరో ఎలా ఉండాలో అలానే దిగిపోయాడు.  హీరోయిన్లుగా నభా నటేష్, నిధి అగర్వాల్ లు నటించారు. జులై 18న ఈ సినిమా రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: