టాలీవుడ్ లో ప్రముఖ చాయాగ్రహకుడు చోటా కె నాయుడు బంధువుగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు సందీప్ కిషన్.  సందీప్ కిషన్ నటించిన ‘వెంటకటాద్రి ఎక్స్ ప్రెస్’ మినహీ ఏ సినిమా పెద్దగా హిట్ కాలేదు.  అయితే తెలుగునే కాకుండా ఈ హీరోకి తమిళ్ లో మంచి క్రేజ్ ఉంది.  తాజాగా సందీప్‌ కిషన్‌, నిర్మాతగా వ్యవహరిస్తూ.. నటించిన 'నిను వీడని నీడను నేనే' మంచి టాక్ తో నడుస్తుంది.  ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగులో రాని వెరైటీ హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చింది.  కామెడీ, సెంటిమెంట్, హర్రర్ అన్నీ ఆ మూవీకి బాగా కలిసి వచ్చాయి.

వెరైటీ కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ స్వాగతం పలుకుతారన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ నటించిన  'నిను వీడని నీడను నేనే' రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా,  సినిమా పరాజయం పొందిందని ఓ వెబ్ సైట్ లో వచ్చిన వార్తపై సందీప్ ఘాటుగా స్పందించాడు. ఈ సినిమా విదేశాల్లో సక్సెస్ కాలేదని, వసూళ్లు బాగాలేవని, విడుదలైన తొలి రోజున ప్రీమియర్స్ తో కలిపి కేవలం 5,939 డాలర్లు మాత్రమే వచ్చాయని, రెండో రోజు 7,513 డాలర్లు, మూడో రోజు 2,588 డాలర్లు వచ్చాయని పేర్కొంది.

ఈ విషయంపై సందీప్ కిషన్ చాలా ఘాటుగా స్పందించారు.. ఈ సినిమా విదేశాల్లో పెద్దగా వసూళ్లు చేయకపోవచ్చు..కానీ తెలుగు లో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టిందన్న విషయం మాత్రం మర్చిపోవొద్దు అని అన్నారు. ఏది ఏమైనా కాస్త సమాచారం సేకరించి వార్తలు రాయాలని, సినిమా విదేశీ వసూళ్లను విమర్శించినట్టుగానే, స్వదేశంలో విజయం సాధించిన విషయాన్ని మెచ్చుకోమని కౌంటరేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: