టాలీవుడ్ జనాలు అందరూ ఊహించినట్టుగానే పూరి జగన్నాథ్ - రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లతోనే ఈ విషయంలో చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. గురువారం రిలీజ్ అవుతోన్న ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అంతెందుకు పూరి - మహేష్ పోకిరి సినిమాకు కూడా అప్పట్లో ఏ సర్టిఫికెట్ నే.
ఇక ఇస్మార్ట్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందట. మొత్తం సినిమా అంతా పచ్చిబూతులు... డబుల్ మీనింగ్ డైలాగులు... హీరోయిన్లతో కావాల్సినంత ఎక్స్పోజింగ్... శృతిమించిన యాక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే పూరి యూత్ను టార్గెట్గా చేసుకుని ఈ సినిమాను తీసినట్టు తెలుస్తోంది. అందుకే సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికెట్ చేతిలో పెట్టేశారు.
ఇక సినిమాలో హీరోయిన్లను చూస్తుంటే ప్రతి సీన్లోనూ వాళ్లు కనపడితే సగం ఒళ్లు చూపించడమో లేదా బూతు డైలాగులు మాట్లాడడమే ఉందట. ఇక పూరి కూడా యూత్నే టార్గెట్ చేసుకున్నాడు... పూరి సినిమాలకు ఫ్యామిలీలు రావడం ఎప్పుడో మానేశారు. దీంతో పూరికి ఏ సర్టిఫికేట్ ఏమీ అడ్డంకి కాదు. మరి ఈ సినిమాతో అయినా పూరి ట్రాక్లోకి వస్తాడో ? లేదా ? ఇప్పటికే ఉన్న ఆరు వరుస ప్లాపులకు తోడుగా ఏడో ప్లాప్ కూడా తన ఖాతాలో వేసుకుంటాడో ? చూడాలి.