తెలుగు ఇండస్ట్రీలో ఆ మద్య కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చిన నటి శ్రీరెడ్డి తర్వతా అనూహ్యంగా కనిపించకుండా పోయింది.  ఆమె ఉద్యమం చేసే సమయంలో ఎంతో మంది సానుభూతి పలికారు..చేయూత ఇవ్వడానికి వచ్చారు..అంతలోనే ఆమె పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారే శ్రీరెడ్డికి వ్యతిరేకత వచ్చింది.  దాంతో ఆమె చెన్నైకి వెళ్లిపోయింది..అక్కడే ఓ యూట్యూబ్ ఛానలో ఓపెన్ చేసి అక్కడ నుంచి తన పోస్టింగ్ లు చేస్తూ కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతుంద.

ఇదే సమయంలో సెలబ్రెటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఎప్పుడూ ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీతో హెడ్ లైన్స్ ఎలా సృష్టించాలో ఈమెకు బాగా తెలుసు.  తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి తెరపైకి వచ్చింది శ్రీరెడ్డి. అందులో భాగంగానే అక్కినేని కోడ‌లు స‌మంతను టార్గెట్ చేసింది. ఫేస్ బుక్‌లో ఈమె రాసిన కొన్ని మాట‌లు ఇప్పుడు సంచల‌నం సృష్టిస్తున్నాయి.

స‌మంత అక్కినేని చూపిస్తే సూప‌ర్ అంటారు.. ఆమె గ్లామ‌ర్ షో చేస్తుంటే క‌ళ్ల‌ప్ప‌గించుకుని చూస్తారు.. మ‌రి నేను చూపిస్తే మాత్రం ఎందుకు చూడ‌రు.. మారండిరా అరేయ్ అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. స‌మంత ఎక్కువేంటి.. శ్రీ‌రెడ్డి త‌క్కువేంటి అని ప్ర‌శ్నిస్తుంది. అంతే కాదు పక్కవారి భార్యలపైనే ఎప్పుడూ కన్నుంటుంది.. సొంత భార్య‌ల‌పై ఉండ‌దు అంటూ ప‌చ్చిగా పోస్ట్ పెట్టేసింది శ్రీ‌రెడ్డి.


అయితే శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. శ్రీరెడ్డి నోటి దురుసు తగ్గించుకుంటే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: