టాలీవుడ్‌లో నిన్నటి టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పని అయిపోయింది అన్న చర్చలే ఇండ‌స్ట్రీలో ఎక్కువగా జరుగుతున్నాయి. టెంపర్ తర్వాత ఏకంగా ఆరు వరుస ప్లాపులు ఇచ్చాడు పూరి. టెంపర్ త‌ర్వాత‌ బాలయ్య కళ్యాణ్‌రామ్ లాంటి హీరోలు ఛాన్స్ ఇచ్చిన పూరి ఆ ఛాన్సులను సద్వినియోగం చేసుకుని హిట్ కొట్టడంలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు పూరిని తెలుగు ప్రేక్షకులకు నమ్మాలంటే గురువారం రిలీజ్ అయ్యే శంకర్ ఒక్కటే దిక్కు. వరుస ఫ్లాపుల్లో సతమతమవుతున్న రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపైనే చాలామంది టెక్నీషియన్ల తలరాత కూడా ఆధారపడి ఉంది.


ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లు... ట్రైలర్ లతో ఇస్మార్ట్ శంకర్ నానా రచ్చ చేస్తోంది. రామ్ గత సినిమాలకు భిన్నంగా బాడీ లాంగ్వేజ్ కనిపిస్తోంది. మరోవైపు హీరోయిన్లు కావాల్సినన్ని అందాలు ఆరబోశారు. ఇక డైలాగుల్లో డబుల్ మీనింగ్.... కావాల్సినంత బూతు కంటెంట్ ఉందని ట్రైలర్ చెప్పక‌నే చెప్పేసింది. ఇక ఇస్మార్ట్‌కు సెన్సార్ బృందం ఈ చిత్రానికి `ఏ` సర్టిఫికెట్ ఇచ్చింది. రొమాన్స్ హద్దు మీరిందన్నది టీజర్ తోనే తేలింది. 


ఇవ‌న్నీ యూత్‌లో సినిమాపై క్రేజ్ పెంచేశాయి. దీంతో ఇది ఇప్పుడు ఇస్మార్ట్ బాక్సాఫీస్ కి కలిసిరానుందని ఆన్ లైన్ బుకింగ్ కౌంటర్ చెబుతోంది. ఇప్పటికే  డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో షాకిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవ‌ల పూరి సినిమాకు అస‌లు ఆన్‌లైన్ బుకింగ్స్ మ‌ర్చిపోయారు. అయితే ఇప్పుడు టెంప‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజులో బుక్సింగ్ ఉండ‌డంతో ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఈ సినిమాతో పూరి హిట్ కొడితే మ‌ళ్లీ పూరి మార్క్ క్రేజ్ ర‌చ్చ రంబోలా మామూలుగా ఉండ‌ద‌ని లెక్క‌లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: