నెలన్నర రోజులపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను అలరించిన ప్రపంచ కప్ ఫైనల్ ఆదివారం ముగిసింది. న్యూజిలాండ్ - ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య న‌రాలు తెగే ఉత్కంఠ మ‌ధ్య జ‌రిగిన ఈ మ్యాచ్ టై కావ‌డంతో నిర్వ‌హించిన సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయ్యింది. చివ‌ర‌కు నిబంధనల ప్రకారం ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించడం జరిగింది. ఈ నిబంధ‌న‌ల‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.


ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌ను చూసిన టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స్పందించాడు. “గత రాత్రి జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ అనుభవాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇంత వరకు ఎప్పుడూ చూడని ఉత్కంఠతను రేపే మ్యాచ్ అది. రెండు జట్లు ఉత్తమమైన ప్రదర్శన చేశాయి. ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిస్తే, న్యూజిలాండ్ మనసులు గెలిచింది. ఇరు జట్లకు అభినందనలు” అని ట్వీట్ చేశారు.


ఈ ట్వీట్‌ను బ‌ట్టి చూస్తే మ‌హేష్ కూడా మ్యాచ్‌ను ఎంతో ఉత్కంఠ‌తో ఎంజాయ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక మ‌హ‌ర్షి హిట్ ఎంజాయ్ చేసిన మ‌హేష్ ఈ సెల‌బ్రేష‌న్స్ కోసం ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లితో పాటు త‌న ఫ్యామిలీతో క‌లిసి వెళ్లి ఇంగ్లండ్‌లో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ ఎంజాయ్ చేసిన సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: