ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం రోజున రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ ``సాహో`` సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇప్పడు సాహో ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కబోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న సాహో సినిమాకు రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం అందిస్తున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “సాహో” చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుండగా,నీల్ నితిన్ ముఖేష్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జాకీ ష్రాఫ్,మందిరా బేడీ,మురళి శర్మ,వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు.. తాజాగా రిలీజ్ అయిన సాహో సాంగ్ దుమ్ములేపుతున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సందర్భంగా `సాహో` షూటింగ్ పూర్తి కావడంతో డైరెక్టర్ సుజీత్ డబ్బింగ్ కార్యక్రమాలతో పాటు,గ్రాఫిక్ వర్క్ పూర్తి చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయాలని నిర్విరామంగా సాహో టీం పనిచేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నో ఆశలతో వెయిట్ చేస్తున్నారు.