బార్బీ బొమ్మలా ఉండే కత్రినా కైఫ్ కు దేశం మొత్తం మీద అభిమానులున్నారు. తన అందం, అభినయంతో పదేళ్లకు పైగా బాలీవుడ్ ని ఏలుతోంది. వేరే దేశం నుంచి వచ్చి భారతీయ కుర్రకారుల కలల రాణి అయింది. బాలీవుడ్లో అగ్రకథానాయికగా రాణిస్తున్న కత్రినా కైఫ్ ఈరోజు 36వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం..
* కత్రినా అసలు పేరు కత్రినా టుర్కోట్. జాకీ ష్రాఫ్ భార్య ఆయేషా ఆమె పేరులోని టుర్కోట్ పదాన్ని తీసేసి కైఫ్ అని పెట్టారు.
* కత్రినాను మహేశ్ భట్ తన సినిమాలోకి తీసుకున్నారు కానీ.. హిందీ మాట్లాడటం రాదని ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. ఆ తర్వాత 2003లో ‘బూమ్’ చిత్రంతో బాలీవుడ్కు పరిచయమయ్యారు.
* అత్యధిక పారితోషికం తీసుకుంటున్నా కత్రినా ఉంటున్న ఫ్లాట్ చాలా చిన్నది. చిన్న ఫ్లాట్ అంటారని తన ఇంట్లో ఎలాంటి పార్టీలను ఏర్పాటుచేయరు.
* 2015లో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవంలో కత్రినా పాల్గొన్నారు.
* కత్రినా ముద్దు పేరు ‘క్యాట్’. కానీ ఆమెకు అలా పిలవడం నచ్చదు. ఆ పేరు ఎవరు పెట్టారో కూడా తెలీదంటుంది.
* కత్రినాకు ఎక్కువగా లండన్ వంటకాలంటేనే ఇష్టం.
* 2007లో వచ్చిన ‘వెల్కమ్’ చిత్రంలో కత్రినా ఓ వెండి రంగు గౌనును ధరించారు. దాని ధర సుమారు రూ.2లక్షలు. ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ ఎమీలియో పుచ్చీ ఆ గౌనును కత్రినాకు కానుకగా ఇచ్చారు.
* రణవీర్ కపూర్తో కత్రినా డేటింగ్ చేశారని టాక్. దాంతో కత్రినా, దీపికల మధ్య విరోధం ఉందని బాలీవుడ్ లో టాక్. కానీ దీపిక, రణ్వీర్ సింగ్ల వివాహ విందుకు కత్రినా హాజరై పార్టీ అయ్యేంతవరకూ ఉండి వారితో ఎంజాయ్ చేశారు.
* కత్రినా చదరంగం బాగా ఆడతారు. పెయింటింగ్ అన్నా ఇష్టమే. ఆమిర్ ఖాన్ కు చెస్ లో కత్రినానే పార్ట్నర్.
* యాడ్ లకు కత్రినా తీసుకునే రెమ్యూనరేషన్ రూ.5 కోట్లు.
* కాజోల్, మాధురీ దీక్షిత్లకు కత్రినా వీరాభిమాని.
* 2011, 2013లో కత్రినా మెస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీ.
* బాలీవుడ్లో ఖాన్స్ (షారుక్, సల్మాన్, ఆమిర్, సైఫ్) అందరితో కలిసి కత్రినా నటించారు.
* మ్యాటెల్ ఇండియా అనే టాయ్ కంపెనీ కత్రినా లా ఉండే బార్బీ బొమ్మను తయారుచేసింది. ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్ సెలబ్రిటీ కత్రినాయే.
* కత్రినా దక్షిణాదిలో మూడు సినిమాల్లో నటించింది. రెండు తెలుగు (మల్లీశ్వరి అల్లరి పిడుగు), ఒక మలయాళం (బలరాం vs తారాదాస్).
* కత్రినా అక్షయ్కుమార్కు జోడీగా దాదాపు ఆరు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఏడో చిత్రంగా ‘సూర్యవంశీ’ తెరకెక్కుతోంది.
* ఇండియాలో ఆస్తులు లేవు. ఇప్పటికీ ముంబయిలోని బాంద్రాలో ఓ అద్దె ఫ్లాట్ లో నివసిస్తుంది.
* తెలుగు చిత్రం ‘మల్లీశ్వరి’కి పారితోషికం రూ.80 లక్షలు తీసుకుంది. హీరోయిన్లలో అప్పట్లో అదే హయ్యెస్ట్ పెయిడ్.
* తన తల్లికి చెందిన ఓ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున కత్రినా సామాజిక సేవ చేస్తుంది. దీని ద్వారా అనాథ ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తోంది.
* తన సినిమా విడుదల సమయంలో ముంబయిలోని సిద్ధివినాయక ఆలయాన్ని, మౌంట్ మేరీ చర్చికి, అజ్మేర్ దర్గాకు వెళుతుంది.
* కత్రినా ఎప్పుడూ స్కూల్కి వెళ్లలేదట. కొన్ని కారణాల వల్ల ఇంట్లోనే తన తల్లి ప్రైవేట్ ట్యూషన్ను పెట్టించారట.
* 2011లో కత్రినా, సల్మాన్ డేటింగ్ చేశారు. ‘సల్మాన్తోనే నా తొలి ప్రేమ. తనతో సీరియస్ రిలేషన్ షిప్లో ఉన్నా’ అని ఓసారి కత్రినా స్వయంగా చెప్పింది.