యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా `సాహో`. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ నటులు ఇవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలతో పాటు మహేష్ మంజ్రేకర్, అరుణ్ విజయ్, మురళీ శర్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం రోజు విడుదల అవ్వనుంది. అయితే తాజాగా సాహోకు సంబంధించి ఓ లేటెస్ట్ అబ్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ పైటింగ్ సీన్ను అబుదాబిలో భారీ ఎత్తున్న షూట్ చేశారట. 8 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశానికి ఏకంగా రూ. 70 కోట్ల ఖర్చు చేశారని తెలుస్తోంది.
భారతదేశపు సినిమా చరిత్రలోనే ఓ ఫైటింగ్ సీన్కు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలే లేవు. అయితే ఈ సినిమాకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రోజుకో వార్తను వదులుతూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. మరి ఆ ఫైటింగ్ సీన్ సాహోలో ఏ రేంజులో ఉండబోతుందో ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిందే.