టాలీవుడ్ లో హిట్టైన సినిమాలను ఇప్పుడు బాలీవుడ్ లో వరసగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీమేక్ చేయడానికి ఖర్చు అవుతుంది. పైగా ఎక్కువ లాభాలు వస్తున్నాయి. దీంతో రీమేక్ వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎన్నో సినిమాలను రీమేక్ చేసినా మన నిర్మాతలు వాటివైపు చూడలేదు.
కానీ, ఇపుడు బాలీవుడ్ వైపు చూస్తుండటం విశేషం. రీసెంట్ గా తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది. దీనికోసం చేసిన ఖర్చు తక్కువ. ఇప్పటి వరకు దాదాపు రూ. 260 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ స్థాయిలో వసూలు చేయడంతో.. తెలుగులో హిట్ సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి మన నిర్మాతలు రెడీ అవుతున్నారు.
తెలుగు హిట్టైన జెర్సీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇది వర్కౌటైతే...ఫ్యూచర్లో ఈ నిర్మాతలు తమ సినిమాలను తామే బాలీవుడ్ లో రీమేక్ చేసుకుంటారేమో.
ఇది మంచి పరిణామమే అని చెప్పాలి. బాలీవుడ్ లో అక్కడ నేటివిటీకి తగ్గట్టుగా రీమేక్ చేస్తే.. అక్కడ వాళ్లకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. ఎక్కువ సినిమాలు నిర్మించినట్టు ఉంటుంది.