ఇప్పటి వరకు రామ్ ను ఎవరు చూపించనంత కొత్తగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో చూపిస్తానని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలియజేశారు. రామ్ ఎనర్జీని నేను పూర్తి స్థాయిలో ఉపయోగించాను ఈ మూవీకి.
రామ్ అభిమానులందరికి ఈ సినిమాలో కొత్త రామ్ ని చూస్తారని పూరీ జగన్నాథ్ తెలియజేశారు. ఈ మూవీ ఒక హాలీవుడ్ మూవీకి రీమేక్ అని కొంత మంది ప్రచారం చేస్తున్నారు, కానీ దానిలో ఏమాత్రం వాస్తవం లేదు.
పైసా వసూల్ సినిమాతో నాకు ఇష్టమైన బాలయ్య బాబుకు హిట్ ఇవ్వలేకపోయాననే అసంతృప్తి కొంచం ఉంది. ఆయన కోసం ఎప్పటికైనా ఒక పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేస్తానని పూరి జగన్నాథ్ చెప్పారు. ఆ సినిమాతో ఆయనకు తప్పకుండా హిట్ ఇస్తానని ఆయన ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఈ నెల 18 న ఇస్మార్ట్  శంకర్ మూవీ విడుదలకానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: