రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు యూత్ లో ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటో ఇట్లే తెలిసిపోతుంది. మరీ ముఖ్యoగా ఈ తరం అమ్మాయిలకు ఆయన డార్లింగ్.. ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన ఈ స్టార్ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

సినిమా, సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకున్నా.. ఆయన హిట్ రేంజ్ ఎలా వుంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అది కాస్తా 'బాహుబలి', 'బాహుబలి 2' చిత్రాలతో మరింత రెట్టింపై ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగి పోయాడు. దేశ, విదేశాల్లో కూడా అభిమానులను పెంచుకున్నాడు. తన ప్రతీ సినిమాకు లుక్ పరంగా, బాడీ ల్యాంగ్వేజ్ లో వేరియేషన్స్ చూపిస్తూ, అభిమానులను ఖుషీ చేస్తున్నాడు ప్రభాస్.


ప్రస్తుతం ఈయన, సుజిత్ డైరెక్షన్ లో 'సాహో' మూవీలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ రిలీజై సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదే కాకుండా 'జిల్' ఫేమ్ డైరక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పూర్తి ప్రేమకథ గా రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.


ఇంతటి క్రేజ్ ఉన్న హీరో.. 'బాహుబలి' సిరీస్ తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. ఎప్పటినుండో ఇటు అభిమానులకు, అటు ఇండస్ట్రీ కి ఒక ప్రశ్నను అలాగే వదిలేశాడు. అది పెళ్లితో పాటుగా మరొక విషయమేమిటంటే ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడం. ఫేస్ బుక్ లో ప్రభాస్ ఎకౌంట్ కు కోటికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆయన స్పందించడం మాత్రం తక్కువే. ఇక సోషల్ మీడియాలో


టాప్ ప్లేస్ లో ఉన్న వన్ ఆఫ్ ది లీడింగ్ సంస్థ 'ఇన్ స్టాగ్రామ్' లో లేటెస్ట్ గా ప్రభాస్ అఫీషియల్ గా జాయిన్ అయినట్లు సినీ వర్గాల సమాచారంయాక్టర్ ప్రభాస్ అనే ఎకౌంట్ తో ఎలాంటి ప్రొఫైల్, పోస్ట్ లేకుండానే ఓపెన్ అయిన ఈ ఎకౌంట్ కు కొన్ని గంటల్లోనే 7ల్యాక్స్ పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఈ సంఖ్య ఇంకా రెట్టింపు అయ్యేలా ఉంది.


ఇప్పటికే హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకొని బాగా ప్రమోట్ అవుతున్నారు అలాగే వాళ్ళ సినిమాలను బాగానే ప్రమోట్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఇది సామాన్య మానవుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇన్ స్టాగ్రామ్.. ట్విట్టర్.. ఫేస్ బుక్ లాంటి చోట్ల ఎంతగా ఫాలోవర్స్ ఉంటే అంతగా ఇమేజ్ ఉన్నట్టు అని అందరూ భావిస్తున్నారు.


సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుండడంతో అక్కడ ఫ్లాట్ ఫామ్ పై ప్రతిదీ ఈజీ అయిపోతోంది. అందుకు తగట్లు క్రేజ్ రెట్టింపు అవుతోంది కూడా. అందుకే ఇక్కడ అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు ప్రతి ఒక్కరూ ఖాతాలు తెరుస్తున్నారు. టాలీవుడ్ స్టార్లలో ఈ తరహా యాక్టివిటీస్ ఉన్న స్టార్లుగా రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ దూసుకుపోతున్నా.. ప్రభాస్ మాత్రం ఈ రేసులో వెనుక పడ్డారనే చెప్పాలి...


ఎందరో స్టార్లు సామాజిక ప్రచారంలో దూకుడు చూపిస్తూ సినిమాలు అలాగే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన పోస్టింగులు పెడుతూ ప్రమోట్ అవుతూ, మనీ సంపాదిస్తున్నారు, కానీ డార్లింగ్ ఇవేవీ పట్టించుకోలేదు, తన గురి మొత్తం కేవలం సినిమాలపైనే అన్నట్లు ఉన్నారు. ఇది మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి కొంత నిరాశనే కలిగించింది. ఏది ఏమైనా ఎప్పటినుండో ప్రభాస్ 'ఇన్ స్టాగ్రామ్' ఎకౌంట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇది పండగలాంటి విషయమనే చెప్పాలి.


ఇక ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రం ఆగస్టు15 న రిలీజ్ కానుంది.. ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ భాషలలో తెరకెక్కుతుంది. మరి రెబల్ స్టార్ ఈ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ తో  అయినా ఫ్యాన్స్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉండి.. ఆయన లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అన్నీ అభిమానులకు తెలియజేస్తాడో లేదో వేచి చూద్దాం...


మరింత సమాచారం తెలుసుకోండి: