టాలీవుడ్ లో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా అందరూ ఎదురుచూస్తున్న సాహో సినిమా రిలీజ్ విషయంలో గత రెండు నెలలుగా అనుమానాలు ఎక్కువ అవుతూ వచ్చాయి. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ సినిమాతో తెలుగు - తమిళ - హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దర్శకుడు సుజీత్ సాహో షూటింగ్ చాలా లేట్ చేయడంతో కచ్చితంగా అనుకున్న టైంకు రిలీజ్ అవుతుందా ? అన్న సందేహాలు కలిగాయి.
అయితే మూవీ మేకర్స్ మాత్రం సినిమా వాయిదా పడటం జరగదని చెప్పడంతో రిలీజ్ డేట్ విషయంలో చాలామంది ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ముందునుంచి ఉన్న అనుమానాలు నిజం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా మూడు భాషల్లోనూ సాహో డబ్బింగ్ అవ్వలేదు.. ప్రమోషన్లు అస్సలు స్టార్ట్ కాలేదు. దీంతో సాహోను ఆగస్టు 15న కాకుండా... రెండు వారాలు ఆలస్యంగా ఆగస్ట్ 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఎక్కడిది అక్కడే ఉందట. ఇక ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు రాని యాక్షన్ సినిమా కావడంతో విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా లేట్ అవుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు 15న కాకుండా... 30 డేట్ లాక్ చేశారని తెలుస్తోంది. ఈ వాయిదాపై ఒకటి రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుంది. ఏదేమైనా కళ్లు కాయలు కాచేలా యేడాది కాలంగా వెయిట్ చేస్తోన్న సాహో కోసం మరో రెండు వారాలు ఆగక తప్పని పరిస్థితి.