'రంగస్థలం' తరువాత మెగా కాంపౌండ్ నుండి సరైన హీరో సినిమా ఒకటి కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు మెగా అభిమానులు. ఇదే క్రమంలో తండ్రి చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రాంచరణ్ తాజాగా మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ఇక విషయంలోకి వెళితే మెగా కాంపౌండ్ నుండి పెద్ద హీరోల సినిమాల కోసం ఎప్పటినుండో మెగా అభిమానులు ఎదురుచూస్తున్న క్రమంలో ఇకనుండి అభిమానులను అలా వెయిట్ చేయించకుండా వరుసగా సినిమాలు నిర్మించే మరియు చేసే ఆలోచనలు రామ్ చరణ్ వున్నట్లు సమాచారం.


అంతే కాకుండా ఇప్పటి వరకు సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ రావడంతో అభిమానులకు రాంచరణ్ క్షమాపణలు కూడా తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం రామ్ చరణ్...డైరెక్టర్ రాజమౌళి తో చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్ కూడా విడుదల అవ్వటానికి ఎక్కువ టైం చేసుకుంటున్న క్రమంలో...రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లనని అంటున్నాడు చరణ్.


ఒక్కో సినిమాకు రెండేళ్ల సమయం తీసుకుంటే అభిమానులకు ఎదురుచూపులు తప్పవని, అంతేకాకుండా టాలీవుడ్ మార్కెట్ కి అన్యాయం జరుగుతుందని చరణ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇకనుండి రాబోయే రోజుల్లో ఏడాదికి ఒక సినిమాని విడుదల చేయడానికి చరణ్ ఇప్పటి నుండే ప్రయత్నాలు కూడా...చేస్తున్నారట. మొత్తం మీద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగా అభిమానులను అలరించడం కోసం చాలా సంతోషం నిర్ణయాలు తీసుకున్నారు అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.


మరింత సమాచారం తెలుసుకోండి: