ఎప్పుడు ఎవరో ఒకరిని కామెంట్ చేస్తూ, ఎవరొకరిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మారిపోయారు అని అంటున్నారు నెటిజన్లు. సినిమాలో అయినా రాజకీయాల్లో అయినా ఏం జరిగిన ప్రతిదాంట్లో తప్పుని చూపించి నిజాలు బయట పెట్టేవారే రాంగోపాల్ వర్మ. 


అలాంటి రాంగోపాల్ వర్మ గత కొంత కాలంగా ఎవరిని విమర్శించడం లేదు.. ఎవరితోను వైరం పెట్టుకోవడం లేదు.. ఎన్నికల సమయంలో చంద్రబాబు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వివాదం తప్ప ఈ మధ్యకాలంలో ఎవరిని ఉద్యేశించి తప్పుగా మాట్లాడ్డం లేదు, నిజాలు బయట పెట్టడం లేదు అని అంటున్నారు నెటిజన్లు ఇవన్నీ చెయ్యకపోగా పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ట్విట్టర్ వేధికాగా ప్రేమోషన్లు చేస్తున్నారు.


ఇవన్నీ చూస్తున్నా నెటిజన్లు 'వర్మ ఎందుకు ఎవరిని విమర్శించట్లేదు' అని కొందరు అంటే, మరికొందరు నెటిజన్లు 'సునామి వచ్చే ముందు ఇలానే ప్రశాంతంగా ఉంటుంది' అని అంటున్నారు మరికొందరు నెటిజన్లు. కాగా రాంగోపాల్ వర్మ విమర్శలు లేకపోయేసరికి న్యూస్ ఛానళ్లు, ఆన్లైన్ మెడియాలు బోసిపోయాయి అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని మళ్ళీ వర్మ వార్తల్లోకి వస్తారా ? లేక ఇంకా విమర్శలు చెయ్యకూడదు అని అనుకుంటున్నారా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: