‘బాహుబలి’ చిత్రం తరువాత ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్లో హైటెక్నికల్ వాల్యూస్తో రూపొందించి ఈ భారీ చిత్రానికి రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది.
సుమారు రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం మంగళవారం నాటితో షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడియకొట్టేసింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగష్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే అదే రోజు ప్రభాస్తో పోటీ పడుతూ.. బాక్సాఫీస్ వద్ద ‘రణరంగం’ సృష్టించేందుకు రెడీ అంటున్నాడు యంగ్ హీరో శర్వానంద్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ పోస్టర్ వదిలారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో శర్వానంద్ డిఫరెంట్ లుక్లో దర్శనం ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా.. ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి పోటీగా ఆగష్టు 15న బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నారు శర్వానంద్. మొత్తానికి ఈ ఇద్దరు యంగ్ హీరోల మధ్య పోటీ ‘రణరంగం’గా మారుతున్న నేపథ్యంలో ‘ఎవరు’ అంటూ బాక్సాఫీస్ బరిలో నేనూ ఉన్నానంటున్నాడు అడవి శేష్. ఆయన నటించిన ‘ఎవరు’ చిత్రం కూడా ఆగష్టు 15న విడుదల కానుంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ పోస్టర్ను విడుదల చేశారు శర్వానంద్. అయితే ‘రణరంగం’, ‘ఎవరు’ చిత్రాలకి సంబంధించి అఫీషియల్ ప్రకటనతో పాటు రిలీజ్ పోస్టర్ వచ్చేశాయి. ఇక ‘సాహో’ నుండి రిలీజ్ పోస్టర్ రావాల్సి ఉంది. మొత్తానికి ఆగష్టు 15 నాడు మూవీ లవర్స్కి పండగనే చెప్పాలి. ముగ్గురు యంగ్ హీరోలు ఒకే రోజు పోటీ పడుతుండటంతో బాక్సాఫీస్ వార్ ఇంట్రస్టింగ్ మారింది. ఈ మూవీ ‘రణరంగం’లో గెలిచి బాక్సాఫీస్ వద్ద ‘సాహో’.. ‘ఎవరు’ అనేది ఆగష్టు 15న తేలిపోనుంది.
ఇదిలా ఉండగా.. ప్రభాస్ ‘సాహో’ చిత్రం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూటింగ్ పూర్తైనప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో జాప్యం వల్ల ఇండిపెండెన్స్ వార్ (ఆగష్టు 15) నుండి ప్రభాస్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.