విలన్ గా తండ్రిగా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగిన సమర్ధత ప్రకాష్ రాజ్ కు ఉంది. అయితే ఆ సమర్థత ఇచ్చిన అహంకారంతో ప్రకాష్ రాజ్ తరుచూ తాను నటించే దర్శక నిర్మాతలతో వివాదాలు పెట్టుకోవడంతో అతడి తలనొప్పులు భరించలేక ప్రకాష్ రాజ్ కు ఇవ్వవలసిన పాత్రలు అన్నీ గత రెండు మూడు సంవత్సరాలుగా జగపతి బాబుకు ఇస్తూ వచ్చారు. 

దీనితో టాప్ హీరోల సినిమాలలో జగపతి బాబు లేకుండా సినిమాలు రాని పరిస్థితి ఏర్పడింది. అయితే అనూహ్యంగా ఇలా వరసపెట్టి వస్తున్న అవకాశాలు జగపతి బాబుకు కూడ ఇగోను కలిగించినట్లు తెలుస్తోంది. ఆ ఇగో సమస్యలు వల్లనే మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి జగపతి బాబును తొలిగించి ఇప్పుడు హడావిడిగా ప్రకాష్ రాజ్ ను ఎంపిక చేసారు. 

వాస్తవానికి ఈమూవీలో విజయశాంతితో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలో జగపతి బాబు నటించడానికి అంగీకరించాడు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఈమూవీలో విజయ్ శాంతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో జగపతి బాబు పాత్ర ఈమూవీ కథలో తగ్గిందని టాక్. 

ఈవిషయాలు తెలుసుకున్న జగపతి బాబు తన పాత్రను ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి తగ్గించి నందుకు అసహనం వ్యక్త పరిచి ఈమూవీ నుండి చివరి నిముషంలో తప్పించుకున్నట్లు సమాచారం. దీనితో షాక్ అయిన ఈమూవీ దర్శక నిర్మాతలు జగపతి బాబు స్థానంలో ప్రకాష్ రాజ్ ను రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా వైరల్ కావడంతో జగపతి బాబు ఇగో ప్రకాష్ రాజ్ కు ఊహించని అదృష్టంగా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: