ప్రభాస్ సాహో సినిమా వాయిదా పడింది. ఆగస్టు 15 నుంచి 30 వ తేదీకి పోస్ట్ ఫోన్ అయ్యింది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు మింగుడుపడని విషయమే. కాకపోతే, సినిమాను అనుకున్న సమయానికి అన్ని పూర్తి చేయకుండా రిలీజ్ చేస్తే తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
దానికంటే కొంత ఆలస్యమైనా ... అన్ని పనులు ముగిసిన తరువాతనే రిలీజ్ చేయడం మంచిది కదా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కు మంచి స్కోప్ ఉంది. అందుకే దీనిపై దృష్టి పెట్టారు. అయితే, సాహో వెనక్కి తగ్గడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు.
ఈ సినిమా వెనుక టి సిరీస్ కూడా ఉన్నది. బాలీవుడ్ లో ఈ సినిమాను భారీ మొత్తానికి తీసుకుంది. ఆగస్ట్ 15 వ తేదీన రిలీజ్ చేస్తే .... థియేటర్ల సమస్య వస్తుంది. ఆరోజు అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్, బట్లా హౌస్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
బట్లా సినిమాకు టిసిరీస్ నిర్మాత. సాహో సినిమాను కూడా టిసిరీస్ రిలీజ్ చేస్తున్నది కాబట్టి.. రెండు సినిమాలకు క్లాష్ వస్తుంది. అందుకే సాహో సినిమాను వాయిదా వేసుకున్నట్టుగా ఓ ప్రచారం జరుగుతున్నది. ఏదైతేనేం సినిమా వాయిదా పడింది.