సాయి పల్లవి టాలెంటెడ్ హీరోయిన్. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అయినప్పటికీ సాయి పల్లవి తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తుంది కానీ, గ్లామర్ పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిద్దపడదు.
ఫిదా సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది సాయి పల్లవి. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసింది. కానీ పెద్దగా ఉపయోగం లేదు. సాయి పల్లవికి విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలో మొదట అవకాశం వచ్చిందట. కథ నచ్చడంతో సరే అని చెప్పింది.
కాకపోతే ముద్దు సన్నివేశాలు ఉన్నాయని చెప్పడంతో.. ఆ సినిమా నుంచి పక్కకు తప్పుకుంది. తన కుటుంబంతో సహా కూర్చొని సినిమాలు చూసే విధంగా ఉంటేనే సినిమా చేస్తానని లేదంటే చేయబోనని చెప్పింది. ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మికను తీసుకున్నారు.
ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తోంది. ఫిదా తరువాత శేఖర్ మరో సినిమా చేయలేదు. చైతన్య కూడా శేఖర్ కమ్ములతో ఇప్పటి వరకు చేయలేదు. చైతన్య 20 వ సినిమా కాబట్టి మంచి హిట్ కొట్టాలని కసితో సినిమాను తీస్తున్నారు.