మహర్షి లాంటి బ్లాక్బస్టర్ హిట్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నారు. ఎఫ్2 లాంటి సూపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి - మహేష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న సీనియర్ హీరో జగపతిబాబు సడన్గా తప్పుకోవడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఏమైంది? ఎందుకు తప్పుకున్నారు? అనే వాటిపై చర్చలు నడిచాయి. నిజానికి వినపడుతున్న సమాచారం మేరకు ముందుగా ఆయనకు చెప్పిన సీన్లు.. ఆ తర్వాత సినిమాలో చేయిస్తున్న సీన్లకు పొంతన లేకపోవడమే కారణం అంటున్నారు.
దీంతో అనిల్ రావిపూడి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన జగపతిబాబు షూటింగ్ నుంచి బయటకు వచ్చేశారట. ఇది మహేష్కు కాస్త షాక్ లాంటిదే. ప్రస్తుతం కాశ్మీర్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ కాశ్మీర్ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే మరికొందరు పాల్గొన్నారు. జగపతిబాబు తప్పుకోవడంతో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే సన్నివేశాలనే మాత్రామే షూట్ చేస్తున్నారట. అలాగే జగపతిబాబు పాత్రకు ప్రకాష్రాజును తీసుకుంటున్నట్టు సమాచరం. అయితే మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.