ఒకే రోజున రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరోయిన్ కాజల్.  ఇండస్ట్రి కి వచ్చి చాలా కాలం ఐనా వరుస విజయాలతో దూసుకుపోతోంది.   ఒక వైపు సీనియర్ హీరోలతో నటిస్తూనే మరో వైపు కుర్ర హీరోలతో జత కడుతుంది. ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది కాజల్. తను నటించిన కోమలి మరియు రణరంగం సినిమాలూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణరంగం సినిమాలో గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్ కనిపించనున్నాడు. కాజల్ తో పాటుగా కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఈ చిత్రంలో కథానాయికులుగా నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఆగస్టు 2న విడుదల కావలసిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధమైంది. సంయుక్త హెగ్డే,కాజల్,జయం రవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం కోమలి. సరికొత్త కదా అంశంతో ప్రదీప్ రంగరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలకానున్నది. ఇండిపెండెన్స్ డే రోజున మొత్తానికి కాజల్ రెండు చిత్రాలతో ప్రేక్షకులకి మంచి వినోదం అందిస్తుంది. ఈ రెండు చిత్రాలు ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: