సామాజిక మాధ్యమాల వెల్లువలో సెలబ్రిటీలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పోస్టింగులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఏ చిన్న తేడా జరిగినా వెంటనే ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. వినకూడని భాషలో ఇష్టానుసారం తిట్టేస్తున్నారు. ఆ తిట్లు చీవాట్లకు ఎంత పెద్ద స్టార్ అయినా బుక్కయిపోవాల్సి వస్తోంది. ఈసారి సూపర్ స్టార్ మహేష్ వంతు. అంతటి వాడికే మినహాయింపు లేదని తాజా ట్రోలింగ్ చెబుతోంది.


ఇటీవల సోషల్ మీడియా ట్విట్టర్ లో యాక్టివ్ గా వుంటున్న మహేష్ కొత్త సినిమాలపైనా.. కాన్సెప్ట్ బేస్డ్ చిన్ని సినిమాలపైనా ఇటీవల వరుస ట్వీట్ లు పెడుతూ టీమ్ ని అభినందిస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ సహా స్పోర్ట్స్ పైనా మహేష్ ఆసక్తిగా ట్వీట్లు పెడుతున్నారు. వరల్డ్ కప్-2019 మ్యాచ్ ని కుటుంబ సమేతంగా వీక్షించిన మహేష్ .. క్రికెట్ ఫీవర్ పీక్స్ కు చేరడంతో దీనిపై కూడా పోస్టింగులు పెట్టారు. వరల్డ్ కప్ ఫైనల్ లో జరిగిన రసవత్తర పోరులో న్యూజిలాండ్ పోరాడినా ఇంగ్లాండ్ విజయాన్ని సాధించి కప్ గెలుచుకుని విశ్వవిజేతగా నిలిచింది.


అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ చూపించిన పొరాట పటిమకు ఫిదా అయిన సూపర్ స్టార్ మహేష్ ``ఇంగ్లాండ్ కప్ గెలుచుకున్నా కానీ న్యూజిలాండ్ మనసు గెలుచుకుంది`` అని పోస్ట్ పెట్టారు. అదీ మ్యాచ్ అయిపోయాక కాస్త ఆలస్యంగా స్పందించారు. ఇక్కడే మహేష్ నెటిజన్ లకు దొరికిపోయారు. ఆదివారం మ్యాచ్ జరిగితే సోమవారం ఆర్థ్రరాత్రి స్పందించడం ఏమిటని మహేష్ ని ఓ రేంజ్ లో నెటిజన్స్ తూలనాడడం చర్చనీయాంశంగా మారింది. మహేష్ చెప్పింది కరెక్టే అయినా టైమింగ్ రాంగ్. దీంతో అడ్డంగా బుక్కైపోయారు. 


`మహర్షి` సినిమా విషయంలో పెట్టిన కొన్ని పోస్ట్ ల పై కూడా పెటిజన్స్ మహేష్ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇలా మహేష్ నెటిజన్ లకు దొరికిపోవడం ఇది రెండవ సారి. అయితే పోస్టింగ్ లేటయినంత మాత్రాన నెటిజనులు సహజనం కోల్పోవాలా?  ఇది మరీ టూమచ్ అని ఘట్టమనేని అభిమానులు ట్రోలర్స్ పై కౌంటర్లు వేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: