ఇటీవల ‘మహర్షి’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో కుటుంబ సమేతంగా తో పాటు ఆ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి యూరప్ ట్రిప్ వేశారు సూపర్ స్టార్ మహేష్. అంతేకాకుండా ఇంగ్లాండ్ దేశంలో ఆ సందర్భంలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచులు జరుగుతున్న క్రమంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ కూడా తిలకించారు. ఈ సందర్భంగా ఆ సమయంలో మ్యాచ్ జరుగుతున్న సమయం లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసి హల్చల్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు యూరప్ ట్రిప్ ముగించుకుని ఇటీవల హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టింది నెక్స్ట్ చేయబోయే సినిమా సరిలేరు నీకెవరు సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నారు.


ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ను ఉద్దేశించి మహేష్ బాబు ట్విట్టర్లో చేసిన కామెంట్లపై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చూపించిన పొరాట పటిమకు ఫిదా అయిన సూపర్ స్టార్ మహేష్ ``ఇంగ్లాండ్ కప్ గెలుచుకున్నా కానీ న్యూజిలాండ్ మనసు గెలుచుకుంది`` అని పోస్ట్ పెట్టారు.


అదీ మ్యాచ్ అయిపోయాక కాస్త ఆలస్యంగా స్పందించారు. ఇక్కడే మహేష్ నెటిజన్ లకు దొరికిపోయారు. ఆదివారం మ్యాచ్ జరిగితే సోమవారం అర్ధరాత్రి స్పందించడం ఏమిటని మహేష్ ని ఓ రేంజ్ లో నెటిజన్స్ తూలనాడడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడో స్పందించాల్సిన మహేష్ చాలా లేటుగా స్పందించడంతో మహేష్ బాబుని ట్రోలర్లు ఆర్ఎస్ పోవడంతో సోషల్ మీడియాలో మహేష్ పరిస్థితి పాపం ఉన్నట్టుగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: