బిగ్ బాస్ సీజన్ 3లో తనకి మొదటి అవకాశం ఇచ్చి తర్వాత మోసం చేశారని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది నటి గాయత్రీ గుప్త. ఇటువంటి క్రమంలో తాజాగా ఈ ఉదంతం గురించి మరొకసారి గాయత్రి గుప్తా మాట్లాడుతూ తనకి బిగ్ బాస్ హౌస్ లో మొదట అవకాశం ఎలా వచ్చింది ఇంకా మిగతా విషయాల గురించి చెప్పుకొచ్చింది గాయత్రి గుప్తా. మొట్టమొదటిగా బిగ్ బాస్ షో నిర్వాహకులు తనని సంప్రదించినప్పుడు బిగ్ బాస్ పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని షో కి ఓకే చెప్పినట్టు తెలిపింది. అంతేకాకుండా జీవితంలో ప్రైవసీ ఉండదనేది వాస్తవంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లు.. తన ఇంట్లో కూడా ఒక కెమెరా ఉందనే ఆలోచనతో ఉంటేనే సేఫ్ గా బ్రతకగలుగుతానని అనుకున్నట్లు చెప్పింది.


ఆ కారణంగా బిగ్ బాస్ కి కనెక్ట్ అయినట్లు.. వాళ్లు ఆఫర్ చేసిన పేమెంట్ కూడా నచ్చడంతో బిగ్ బాస్ కి ఓకే చెప్పేశానని తెలిపింది. మీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా..? అని నిర్వాహకులు అడిగినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందని చెప్పినట్లు వెల్లడించింది. ఆ వ్యాధి కారణంగా బరువులు ఎత్తలేనని, పది రోజులకొకసారి ఫిజియోథెరపీ అవసరం పడొచ్చని చెప్పినట్లు తెలిపింది.


చివరాకరికి బిగ్ బాస్ షో నిర్వాహకులు తనకి హ్యాండ్ ఇవ్వడంతో ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో...గాయత్రి గుప్తా కి ఎందుకు షో లో అవకాశం ఇవ్వలేదు అన్న విషయంపై షో నిర్వాహకులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇందుమూలంగా గాయత్రి గుప్తా కి ఆటో ఇమ్యూన్ డిసీజ్ రోగం ఉన్నందువల్ల ఫైనల్ గా మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్లు షో నిర్వాహకులు తనతో చెప్పినట్లు గాయత్రీ గుప్త ఇటీవల ప్రకటించింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: