భద్ర సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసాడు బోయపాటి శ్రీను. సింహా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో బోయపాటి శ్రీను స్టార్ డైరెక్టర్గా మారాడు. మధ్యలో దమ్ములాంటి ఫ్లాప్ వచ్చినా ఆ తరువాత వరుస హిట్లు ఇవ్వడంతో స్టార్ హీరోలందరూ బోయపాటి శ్రీను సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపారు. ఒక దశలో మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా సినిమా ఓకె అయింది. కానీ వినయ విధేయ రామ ఫ్లాప్ అవ్వటంతో బోయపాటికి సినిమా ఛాన్సులు ఇచ్చేవారే కరువయ్యారు. అప్పటిదాకా అవకాశాలిస్తామన్నవారు కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించటానికి ఆసక్తి చూపలేదు. 
 
వినయ విధేయ రామ ఫ్లాప్ అవ్వటం మాత్రమే కాకుండా కథా కథనాల విషయంలో బోయపాటి శ్రీను పై విమర్శలు వచ్చేలా చేసింది. వినయ విధేయ రామ సినిమాలోని కొన్ని సీన్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరిగాయి. దీనికి తోడు జనాలు కొత్త కథా కథనాలున్న సినిమాలవైపు ఆసక్తి చూపుతున్నారు తప్ప ఊర మాస్ సినిమాల్ని మాత్రం పట్టించుకోవట్లేదు. 
 
వినయవిధేయ రామ ఫ్లాప్ అయినా బాలకృష్ణ బోయపాటి శ్రీనుకు అవకాశమిస్తారని అందరూ భావించారు. గతంలో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నప్పటికీ బోయపాటి బాలయ్య కాంబో సినిమాకు భారీ బడ్జెట్ అయ్యేలా ఉండటంతో నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. ఇలా అవకాశాల్లేని బోయపాటి శ్రీనుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమా చేస్తానని మాటిచ్చారు. ఇంకా హీరో కన్ఫామ్ కానప్పటికీ ప్రస్తుతం బోయపాటి శ్రీను ఉన్న పరిస్థితుల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా రావటం అంటే గొప్ప విషయమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: