చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందాన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచేసుకుంది. చలో సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించినా రష్మిక కు ఆమె అందం, నటనతో రెండొవ హిట్ కూడా కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు తెలుగు ఇండస్ట్రీ నుంచి భారీ ఆఫర్స్ వచ్చేసాయి. 


గీత గోవిందం హిట్ తర్వాత నాని సరసన 'దేవదాస్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించి అభిమానులను షాక్ కు గురిచేసింది. ఇప్పుడు మరోసారి విజయదేవర్ కొండ సరసన 'డియర్ కామ్రేడ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రం ప్రేమోషన్స్ లో బిజీగా ఉంది. 


కాగా మహేష్ బాబు ప్రస్తుతం తీసే సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కథానాయకగా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె పారితోషికాన్ని భారీగా పెంచేశారు. దీంతో ఆమె పారితోషికంపై పలు రకాలుగా వార్తలు రావడంతో 'రష్మిక మందాన' స్పందిస్తూ ''నేను నా పారితోషికాన్ని భారీగా పెంచేశాననడంలో నిజం లేదు. నాకు గల 'సక్సెస్' రేటును బట్టి, 'క్రేజ్'ను బట్టే తీసుకుంటున్నాను. అంతకంటే తక్కువ నేను తీసుకోలేను, ఎక్కువ అడిగినా ఎవరూ ఇవ్వరు. నా పారితోషికం ఎప్పుడూ నా కష్టానికి తగినట్టుగానే ఉంటుంది" అంటూ చెప్పారు రష్మిక.  


మరింత సమాచారం తెలుసుకోండి: