యువ హీరో నాగశౌర్య నటించిన ‘ఛలో’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక.  మొదటి సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుసగా తెలుగు లో వరుసగా సినిమా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అయితే రష్మికు అదృష్టం కాసింత ఎక్కువే వరించింది.  రెండో సినిమా విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘గీతాగోవిందం’ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  దాంతో రష్మికకు మరిన్ని ఛాన్సులు రావడం మొదలయ్యాయి.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ భామ బిజీ హీరోయిన్ గా మారింది.  ప్రస్తుతుం విజయ్ దేవరకొండ నటించిన ‘డీయర్ కామ్రెడ్’ లో నటించింది. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇటీవల రష్మిక రెమ్యూనరేషన్ భారీగా పెంచిందని తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన రష్మిక.. నేను నా పారితోషికాన్ని భారీగా పెంచేశాననడంలో నిజం లేదు.

నాకు ఉన్న సక్సెస్ రేటును బట్టి .. క్రేజ్ ను బట్టే తీసుకుంటున్నాను. అంతకంటే తక్కువ నేను తీసుకోలేను, ఒకవేళ నేను  ఎక్కువ అడిగినా ఎవరూ ఇవ్వరు. నా పారితోషికం ఎప్పుడూ నా కష్టానికి తగినట్టుగానే ఉంటుంది అంటూ తనపై వస్తున్న రూమర్లపై ఘాటుగానే స్పందించింది.  ప్రస్తుతం రష్మిక నితిన్ జోడీగా 'భీష్మ' .. మహేశ్ బాబు సరసన నాయకిగా 'సరిలేరు నీకెవ్వరు' చేస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తదుపరి సినిమాలో నాయికగాను ఛాన్స్ కొట్టేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: