ప్రభాస్ సాహో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శెరవేగంగా సాగుతున్నాయి. సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ప్లస్ కానున్న సంగతి తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. విజువల్ వండర్ గా ఉండాలని చెప్పి సినిమాను పోస్ట్ ఫోన్ చేశారట. సినిమాకు ఎలాగో హైప్ వచ్చింది.
విజువల్స్ పరంగా బాగుంది అనే టాక్ వస్తే సినిమా కలెక్షన్లు అదిరిపోతాయి. అందుకోసమే రెండు వారాలపాటు సినిమాను వాయిదా వేశారు. ఆగష్టు 30 న సినిమాను రిలీజ్ చేస్తారట. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయని, సినిమా మొత్తం మీద 40 నిమిషాలసేపు ఈ యాక్షన్ సీన్స్ ఉంటాయని అంటున్నారు.
యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం మూడు గంటల సినిమాలో 40 నిమిషాల పాటు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని థ్రిల్ కు గురిచేస్తాయని యూనిట్ భావిస్తోంది.
యాక్షన్ సన్నివేశాలే సినిమాకు హైలైట్ గా ఉంటాయని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేస్తున్నది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రిలీజైన వెంటనే ప్రభాస్ జాన్ సినిమాపై దృష్టి సారిస్తారు.